రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

ప్రజాశక్తి-గుడివాడ (కృష్ణా జిల్లా) : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ బస్టాండ్‌ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఆర్‌టిసి బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సోహెల్‌ (24), సాయి (23), హర్ష (23) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన యువకులు ముబారక్‌ సెంటర్‌ సమీపంలోని కాకర్ల వీధికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️