క్వారీల నుంచి మా గ్రామాన్ని కాపాడండి

Mar 25,2024 15:13 #airport, #mining, #Vizianagaram

క్వారీల వద్ద నిరసన తెలియజేసిన రామచంద్ర పేట గ్రామస్తులు

ప్రజాశక్తి-భోగాపురం : క్వారీల నుంచి మా గ్రామాన్ని కాపాడాలని విజయనగరం జిల్లా రామచంద్ర పేట గ్రామస్తులు సోమవారం క్వారీల వద్ద నిరసన వ్యక్తం చేశారు. క్వారీ పనులను కూడా వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయ నిర్మాణ సంస్థ జిఎంఆర్ కొత్త క్వారీ పనులు ప్రారంభించడంతో గ్రామస్తులంతా అక్కడ చేరుకొని నిరసన తెలిపారు. అనంతరం సమీపంలో మరో క్వారీలో జరుగుతున్న పనుల వద్దకు వెళ్లి పనులు నిలుపుదల చేయాలని అక్కడ ఉన్న సూపర్వైజర్ ను నిలదీశారు. సుమారు 200 అడుగుల లోతులో తవ్వకానికి అనుమతులు ఎవరు ఇచ్చారో చెప్పాలని అన్నారు. అంత లోతులో పేలుళ్లు నిర్వహించడం వలన గ్రామంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని ఆగ్రహించారు. గ్రామ పెద్దలు దుక్క అప్పన్న, రమణ, రామ్ సూరి, పోలిరెడ్డి, యువకులు పాల్గొన్నారు.

➡️