పలు రైళ్లు రద్దు – మరికొన్ని దారిమళ్లింపు : రైల్వే అధికారులు

అమరావతి : నైరుతి రైల్వే జోన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు, పాక్షిక రద్దుచేసి మరికొన్నింటిని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-ధర్మవరం-బెంగళూరు (06595/96) రైళ్లను ఏప్రిల్‌ 3, 10 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. ఈ రైళ్లను ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో గౌరీబిదనూరు-ధర్మవరం సెక్షన్‌లో రద్దుచేసి, గౌరీబిదనూరు-బెంగళూరు మధ్య మాత్రమే నడపనున్నట్లు వివరించారు. జైపూర్‌-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12976) రైలును ఏప్రిల్‌ 1, 8 తేదీల్లో గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా కాకుండా గుంతకల్లు, బళ్లారి, రాయదుర్గం, అరిసికెరె, హసన్‌ స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు వివరించారు. ట్రాక్‌ మరమ్మతు పనుల కారణంగా కలబురగి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22231) రైలును ఏప్రిల్‌ 3, 10 తేదీల్లో ఐదున్నర గంటల ఆలస్యంగానూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 22232)ను ఇవే తేదీల్లో గంట ఆలస్యంగానూ నడుస్తాయని చెప్పారు.

➡️