- మూడు జిల్లాల నుంచి రానున్న వైసిపి నేతలు, కార్యకర్తలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఎన్నికల సన్నాహాక కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు శివారులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సహరా గ్రౌండ్స్లో జరగనున్న ‘సిద్ధం’ సభకు సిఎం జగన్ హాజరుకానున్నారు. ఈ సభకు ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు. తాడేపల్లి నుంచి మధ్యాహ్నం 3.25కు హెలికాఫ్టర్లో సిఎం బయలుదేరి దెందులూరు సమీపంలో హైవే పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 3.30 నుంచి 4.45 గంటల వరకూ బహిరంగసభలో పాల్గొంటారు. 4.55 గంటలకు తిరుగుప్రయాణం అవుతారు.