ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆకాశవాణి, దూరదర్శన్లో ఈనెల 7వ తేదీన సిపిఎం నాయకుల ప్రసంగాలు ప్రసారం కానున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఏడోతేదీ సాయంత్రం ఐదుగంటలకు ఆకాశవాణిలో ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం 8.15 గంటలకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఏం.ఏ.గఫూర్ దూరదర్శన్లో ప్రసంగించనున్నారు.