తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ : సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సాయంత్రం జరిగింది. కూకట్‌పల్లికి చెందిన దేవపంగు వివేక్‌ (14) నాదర్‌గుల్‌లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నిన్న సాయంత్రం 4.30 గంటల సమయంలో వివేక్‌ వసతి గృహంలోని తన గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఓ టీచర్‌ కొట్టడంతో మనస్తాపం చెంది వివేక్‌ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️