ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

-వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, గ్రీవెన్స్‌ సెల్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి, లీగల్‌సెల్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి, నాయకులు విల్సన్‌బాబు, పానుగంటి చైతన్యతో కలిసి సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో టిడిపి యథేచ్ఛగా ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఎన్‌ఆర్‌ఐ విభాగం డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు రూ.2 వేల కోట్లను డంప్‌ చేసిందని తమకు సమాచారం వుందని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ సందర్భంగా జాతీయ పతాకాన్ని అవమానించారని వివరించారు.

➡️