రెబల్స్‌పై టిడిపి వేటు

Apr 30,2024 00:51 #rebales, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెబల్స్‌పై టిడిపి వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిపై చర్యలు తీసుకుంది. విజయనగరం, ఉండి నియోజకవర్గాలకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలు చేసిన మీసాల గీత, వి వెంకట శివరామరాజును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, వీరితోపాటు అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యామ్‌కుమార్‌, పోలవరానికి చెందిన ముడియం సూర్య చంద్రరావును కూడా సస్పెండ్‌ చేశారు.

➡️