కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వద్ద డబుల్‌ బెడ్రూమ్‌ లబ్ధిదారుల ఆందోళన

Apr 12,2024 12:03 #cm kcr, #Telangana

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వద్ద గజ్వేల్‌కు చెందిన డబుల్‌ బెడ్రూమ్‌ లబ్ధిదారులు ఫామ్‌ హౌస్‌ గేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ డ్రాలో 1,100 మంది పేర్లను తీశారని.. వీరిలో ఒక్కరికి కూడా ఇంత వరకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇంటిని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌ రావు, ఒంటేరులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. తాము ఇక్కడకు వచ్చి ఎంతో సేపు అవుతున్నా కేసీఆర్‌ నుంచి కనీస స్పందన కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు.

➡️