కష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత..

  •  వైసిపి ప్రచారంలో జనసేన నేత ఇంటిపై వైసిపి కార్యకర్తలు దాడి
  •  ఎస్‌పి కార్యలయం వద్ద టిడిపి, జనసేన నాయకుల బైఠాయింపు

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నేత కర్రి మహేష్‌ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. ఈ రోజు విశ్వ బ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి పేర్ని కిట్టు వచ్చారు. ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్‌ ఇంటి ఎదుట పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవ్వింపు చర్యలకు పేర్ని కిట్టు అనుచరులు పాల్పడ్డారు. ప్రశ్నించినందుకు కర్రి మహేష్‌ ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో స్టేషన్‌ వద్ద జనసేన, టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్టేషన్‌ ముందు రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళనకు మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకష్ణ మద్దతు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మచిలీపట్నం పీఎస్‌ నుండి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన కూటమి అభ్యర్థులు కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి వందలాది కార్యకర్తలతో వెళ్లారు. న్యాయం కోసం ఎస్పీ కార్యాలయం లోపల బైఠాయించారు.

➡️