టిడిపి తుది జాబితా విడుదల

Mar 30,2024 08:35 #candidates, #TDP

– గంటా, కళాకు దక్కిన చోటు
– గుంతకల్లు నుంచి మాజీ మంత్రి జయరాం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మొత్తం పెండింగ్‌లో 8 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల జాబితాను టిడిపి కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ సీనియర్లు గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావుకు చోటు దక్కింది. గంటాకు భీమిలి, కళాను చీపురుపల్లి స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించింది. అదే విధంగా ఇటీవల టిడిపిలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు గుంతకల్‌ సీటు కేటాయించింది. కదిరి శాసనసభకు కొత్త అభ్యర్థిని ప్రకటించింది. రెండో జాబితాలో కందికుంట యశోదా దేవిని ప్రకటించగా, ఇప్పుడు కందికుంట ప్రసాద్‌కు అవకాశం కల్పించింది.
శాసనసభ అభ్యర్థుల వివరాలు

టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల పేర్లు.. పోటీ చేసే స్థానాలు

1. విజయనగరం – అప్పలనాయుడు
2. ఒంగోలు – మాగుంట శ్రీనివాసులరెడ్డి
3. అనంతపురం – అంబికా లక్ష్మినారాయణ
4. కడప – చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి

 

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు.. పోటీ చేసే స్థానాలు

1. చీపురుపల్లి – కళా వెంకట్రావు
2. భీమిలి – గంటా శ్రీనివాసరావు
3. పాడేరు – వెంకటరమేష్‌ నాయుడు
4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి
5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
6. ఆలూరు – వీరభద్ర గౌడ్‌
7. గుంతకల్లు – గుమ్మనూరు జయరాం
8. అనంతపురం అర్బన్‌ – దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌
9. కదిరి – కందికుంట వెంకటప్రసాద్‌

➡️