ప్రజాశక్తి-తిరుపతి : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, జూన్ 29న తేదీ శనివారం రోజున 80,404 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 35,825 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.