ఇది కాలం చెల్లిన బస్సు..!

Feb 20,2024 11:31 #Eluru district, #outdated bus

ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్‌టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోయింది. ఎంతసేపటికీ ఆ బస్సు స్టార్ట్‌ కాకపోవడంతో విద్యార్థులు, ప్రయాణీకులు కిందికిదిగి అవస్థలు పడుతూ బస్సుని నెట్టారు. ఎంత నెట్టినా బస్సు స్టార్ట్‌ కాకపోవడంతో స్కూలు, కాలేజీల విద్యార్థులు, ప్రయాణీకులు వారి వారి దారులు వెతుక్కున్నారు. కాలం చెల్లిన బస్సులనీ, ఆర్టీవో ఆఫీసర్లు బస్సులను చెకింగ్‌ చేయరా ? అనీ.. ప్రైవేట్‌ బస్సులను మాత్రమే చెకింగ్‌ చేస్తారా ? అంటూ అక్కడి జనాలు అసహనాన్ని వ్యక్తం చేశారు.

➡️