హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో బుధవారం రెండో రోజు కూడా విజిలెన్స్ అధికారులు సోదాలను కొనసాగించారు. మైత్రివనం నాలుగో అంతస్తులో ఉన్న అన్ని ఫైళ్లను సీజ్ చేశారు. హెచ్ఎండిఏలో గత తొమ్మిదేళ్లలో ఇచ్చిన అనుమతులను పరిశీలిస్తున్నారు. 50 మందితో కూడిన స్పెషల్ విజిలెన్స్ బృందం సోదాలు నిర్వహిస్తు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఒకవైపు హెచ్ఎండీఏ సమీక్షా సమావేశానికి సిద్ధమవ్వగా, మరోవైపు విజిలెన్స్ అధికారులు హెచ్ఎండీఏలో సోదాలు కొనసాగించడం గమనార్హం. ఇప్పటికే హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాలకృష్ణను 270కోట్ల అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. అతని అక్రమాలతో పలువురు ఐఏఎస్లకు కూడా సంబంధాలున్నట్లుగా ఏసీబీ గుర్తించింది.