– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ ఉక్కు మెడకు ఉచ్చు బిగించి నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బిజెపి, స్టీల్ప్లాంట్ యాజమాన్యం కుట్రలను పోరాటాలతో తిప్పికొడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 1182వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ సిఒసిసిపి విభాగానికి చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ ప్రగతిలో కీలకపాత్ర పోషించిన కార్మికుల వేదన కేంద్ర ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సభకు ఇటీవల అనకాపల్లి జిల్లాకు వచ్చిన ప్రధాని మోడీ విశాఖ ఉక్కుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.