వెల్దుర్తిలో వైసిపి రాస్తారోకో

May 8,2024 23:42 #rastaroko, #Veldurthi, #Write YCP
జిల్లాలో ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట పాతపట్నం

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో హోమ్‌ ఓటింగ్‌ సందర్భంలో వైసిపి, టిడిపి శ్రేణులు ఘర్షణ పడ్డారు. వైసిపికి చెందిన వారు ఓటర్లను ప్రభావితం చేస్తుండగా దీన్ని టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. ఇరుపక్షాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. టిడిపికి చెందిన అందుగుల లచ్చయ్య చేతికి తీవ్ర గాయం కావడంతో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తమపై టిడిపికి చెందిన వారు దాడి చేశారంటూ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమా, వైసిపి నాయకులు ఆరోపించారు. రమాతోపాటు మరికొందరికి గాయాలయ్యాయంటూ మాచర్లలోని బస్టాండ్‌ సెంటర్‌లో కొద్దిసేపు రాస్తారోకో చేశారు.

➡️