ఓటమి భయంతో వైసిపి తప్పుడుప్రచారం- టిడిపి నేతలు

May 11,2024 21:55 #press meet, #TDP leaders

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఓటమి భయంతో వైసిపి నేతలు అసత్యపు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీలు పి అనురాధ, అశోక్‌ బాబు, శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఎ షరీఫ్‌ విమర్శించారు. జగన్‌ పాలనలో బిసిలు, మైనార్టీలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయని పేర్కొన్నారు. టిడిపి కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ మైనార్టీల రిజర్వేషన్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. వైసిపి పాలనలో మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా చేసిన సాయం శూన్యమని విమర్శించారు. బిసిలకు సంబంధించిన రూ.75వేల కోట్లను జగన్‌ దారిమళ్లించారని, 30 పథకాలను రద్దు చేశారని ఆరోపించారు.

➡️