ఇంటర్నెట్డెస్క్ : ప్రముఖ నటుడు శర్వానంద్ పుట్టినరోజు (మార్చి 6) సందర్భంగా తన కుమార్తె లీలా దేవి మైనేని ఫొటోను సోషల్మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. శర్వానంద్కి కుమార్తె పుట్టిన విషయాన్నే ఆయన ఇప్పటివరకూ బయటపెట్టలేదు. తన పుట్టినరోజు సందర్భంగా తాను నటించే సినిమాల గురించి చెబుతూ.. చిన్నారి లీలాదేవి ఆయన పరిచయం చేశారు. భార్య రక్షిత రెడ్డి, కుమార్తె లీలాదేవితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేయడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.