సందేశ్ఖాలీ: పశ్చిమ బెంగాల్ సందేశ్ఖాలీ ఘటన నిందితుడుగా అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ టార్గెట్గా గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. భూకబ్జా కేసుకు సంబంధించి గురువారం తెల్లవారుజామున నుండి ఈడీ పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల కొరకు ఈడీ, పారామిలిటరీ బలగాలతో పాటు మహిళా బలగాలను కూడా రంగంలోకి దింపారు.