హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్కు రెవెన్యూ శాఖ నోటీసులు పంపింది. తెలంగాణ భవన్లో టీవీ చానల్ నిర్వహించడాన్ని ఈ నోటీసులలో ప్రశ్నించింది. పార్టీ ఆఫీసులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఎప్పటిలోగా ఖాళీ చేస్తారో వారంలోపు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. ఈమేరకు తెలంగాణ భవన్ ఇన్ ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి ఈ నోటీసులు పంపింది.