తిరుపతి : తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని తిరమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలలో నిర్వహించనున్న బ్రహ్మౌత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఆగమసలహాదారులను సంప్రదించి బ్రహ్మోత్సవాలకు అవసరమైన బుక్లెట్ను, శ్రీ సీతారాముల కల్యాణం ముహూర్త పత్రికను, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు , క్యూలైన్లు, గ్యాలరీలు, రూట్మ్యాప్ సిద్ధం చేయాలన్నారు.గ్యాలరీల్లోని యాత్రికులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు సర్వీస్ రూట్ ఏర్పాటు చేయాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆలయం, కళ్యాణవేదిక వద్ద శోభాయమానంగా విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు.