చెన్నై : ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె భవతారణి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని, అక్కడే ప్రాణాలు విడిచారు. ఇళయరాజా కుమారులు యువన్ శంకర్రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా తనదైన ముద్ర వేశారు. తెలుగులో ఆమె ఆలపించిన ‘నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ (గుండెల్లో గోదారి) విశేషంగా అలరించింది. ‘ఫ్రెండ్స్’, ‘పా’, ‘టైమ్’, ‘ఒరు నాళ్ ఒరు కనవు’, ‘అనెగన్’ తదితర చిత్రాల్లో పలు పాటలు పాడారు. ‘ఫిర్ మిలేంగే’, ‘ఇలక్కనమ్’, ‘వెల్లాచి’, ‘అవునా’ తదితర సినిమాలకు సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు. ‘భారతి’ చిత్రంలోని ‘మయిల్ పోలా పొన్ను ఒన్ను’ పాటకుగాను బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా జాతీయ అవార్డును ఆమె అందుకున్నారు.