యెస్‌ బ్యాంక్‌ లాభాల్లో 123% వృద్థి

Apr 27,2024 21:25 #Business

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2023ా24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో యెస్‌ బ్యాంక్‌ 123 శాతం వృద్థితో రూ.452 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.202 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో వడ్డీ ఆదాయం రూ.6,216 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ4లో 20 శాతం పెరుగుదలతో 7,447 కోట్లకు చేరింది. 2023ా24లో మొత్తంగా రూ.1,251 కోట్ల నికర లాభాలు సాధించినట్లు తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 2.2 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 0.9 శాతం నుంచి 0.6 శాతానికి దిగివచ్చాయి.

➡️