న్యూఢిల్లీ : మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నికర లాభాలు 10 శాతం తగ్గి రూ.724 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.803 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో రూ.3,597 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) గడిచిన త్రైమాసికంలో 24 శాతం పెరిగి రూ.4,469 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.51 శాతం నుంచి 1.88 శాతానికి.. నికర ఎన్పిఎలు 0.86 శాతం నుంచి 0.60 శాతానికి తగ్గాయి.