ముంబయి : వరుసగా మూడో రోజూ పేటియం షేర్లు ఆల్టైం కనిష్ట స్థాయిని తాకాయి. బుధవారం బిఎస్ఇలో పేటియం షేర్ 5 శాతం పతనమై రూ.317.15 వద్ద ముగిసింది. దీంతో మధ్యాహ్నం పేటియం షేర్ను ఫ్రీజ్ చేశారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పేటియం ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భావిష్ గుప్తా రాజీనామా చేయడంతో వరుసగా మూడో రోజూ పేటియం షేర్ లోయర్ సర్క్యూట్ను తాకింది. పేటియం పేమెంట్ బ్యాంక్పై ఆర్బిఐ చర్యలకు దిగినప్పటి నుంచి ఆ కంపెనీ షేరు తీవ్ర పతనాన్ని చవి చూస్తోంది.