- రూ.9,300 కోట్ల సమీకరణలో టాటా సన్స్
ముంబయి : టాటా గ్రూపులోని అత్యంత కీలకమైన ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లోని 2.34 కోట్ల షేర్లను బ్లాక్ డీల్లో విక్రయించే యోచనలో ఉంది. ఒక్కోషేర్ను రూ.4,001 ధరతో అమ్మకానికి పెట్టడం ద్వారా రూ.9,362 కోట్ల (1.13 బిలియన్ డాలర్లు) నిధులను సమీకరించాలని టాటా సన్స్ భావిస్తోందని సమాచారం. ఇది టిసిఎస్లో 0.65 శాతం వాటాకు సమానం. ఈ షేర్ల విక్రయానికి సిటీ గ్రూప్, జెపి మోర్గాన్ బ్యాంకులను టాటా సన్స్ నియమించినట్లు సమాచారం. టిసిఎస్లో టాటా సన్స్ సంస్థకు 72.38 శాతం వాటాలు ఉన్నాయి. 0.65 శాతం వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను రుణాల చెల్లింపునకు ఉపయోగించాలని టాటా సన్స్ భావిస్తోందని ఆ వర్గాల సమాచారం. దీనిపై టాటా సన్స్, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి.