న్యూయార్క్ : ప్రపంచంలో అత్యంత సంపన్నుల నగరాల్లో మూడు భారతీయ సిటీలకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్యతో పాటు సంపద విలువపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్నర్స్ తాజా రిపోర్ట్లో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాలు చోటు సంపాదించుకున్నాయి. ప్రపంచంలో అపరకుబేరులుంటున్న ప్రముఖ 50 నగరాల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన 11 నగరాలున్నాయి. గత పదేళ్లతో కోటీశ్వరుల సంఖ్య 48 శాతం పెరిగింది. న్యూయార్క్ నగరంలోని ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరులున్నారు. ముంబయిలో 58,800 మంది, ఢిల్లీలో 30,700 మంది కోటీశ్వర్లున్నారు.