- కలెక్టరేట్ ఎదుట నల్ల రిబ్బన్లతో నిరసన
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎపి జెఏసి అధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎపి ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వి రమణ మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు లంచ్ అవర్లో జేఏసీ భాగ్యస్వామి పక్ష ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై నిరసన తెలిపారు. ఐ అర్ 30 శాతం, పెండింగ్ డిఎలు, జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ బకాయిలు ఇతర 13 డిమాండ్ల పరిష్కారం కొరకు నల్ల బ్యాడ్జీలు ధరించి తమకు డిమాండ్లు పరిష్కారం చెయ్యాలని డిమాండ్ చేశారు. 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నా, 20న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ,ధర్నా 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కొరకు తక్షణమే చర్యలు తీసుకివాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ, విజయనగరం జిల్లా నాయకులు సురేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి రమణ , పింఛన్దారుల సంఘ ప్రధాన కార్యదర్శి నారాయణ , పంచాయతీరాజ్ మినిస్ట్రీయ లు ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు మురళి రాంబాబు, ఇరిగేషన్ ఇరిగేషన్ జిల్లా నాయకులు వై ఆనంద్ కుమార్, ఎన్జీవో జిల్లా మరియు పట్టణ కార్యవర్గ సభ్యులు మరియు నాయకులు నీలాద్రి నాయుడు, శ్రీధర్ బాబు, తవుడు, అప్పలనాయుడు విద్యాశాఖ వ్యవసాయ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నాయకులు మహిళా విభాగం అదిలక్ష్మి , శ్రీ విద్య, శ్రీ స్వప్న పాల్గొన్నారు.