గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు అడ్డగింత

ప్రజాశక్తి – చింతలపూడి

సర్వీసు రోడ్డు నిర్మించకుండా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులు చేపట్టడాన్ని మండలంలోని రేచర్ల గ్రామంలో రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. పొలాలకు వెళ్లే సర్వీస్‌ రోడ్లు వేయకుండా మెయిన్‌ రోడ్డు నిర్మిస్తే రైతులు పొలాల్లోకి వెళ్లడానికి అవకాశం ఉండదని, ముందు సర్వీసు రోడ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. దీంతో గ్రీన్‌ ఫిల్డ్‌ హైవే సిబ్బంది రైతులతో చర్చించారు. చింతలపూడి ఎంపిపి రాంబాబు, సర్పంచి శివరామకృష్ణ, కాంట్రాక్టర్లతో, సిబ్బందితో మాట్లాడారు. దీనిపై శనివారం రైతులతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేసేలా చూస్తామని ఎంపిపి చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు ఉప్పల శ్రీను, కంచర్ల శ్రీను, బలుసు సతీష్‌, దొంతా బాల వెంకటేశ్వర రాఘవరావు, కొమ్మిన అప్పారావు, తాళ్ల రమేష్‌, పసుపులేటి సత్యనారాయణ, కంచర్ల మల్లికార్జునరావు, అడపా పిచ్చయ్య, రైతు సంఘం నాయకులు దొంత కృష్ట, రేచర్ల సర్పంచి శివరా మకృష్ణ పాల్గొన్నారు. ఈ ఆందోళనకు సిపిఐ మండల కార్యదర్శి గురవయ్య, సహాయ కార్యదర్శి సోమశేఖర్‌, జంగా రామచంద్రరెడ్డి మద్దతు తెలియజేశారు.

➡️