రాష్ట్ర స్థాయికి శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు

Nov 23,2023 22:37
విద్యార్థులను

ప్రజాశక్తి – పెద్దాపురంఈ నెల 29న గుంటూరులోని కెఎల్‌ యూనివర్సిటీలో జరిగే బాలల సైన్స్‌ విజ్ఞాన ప్రదర్శనలకు స్థానిక శ్రీ ప్రకాష్‌ సినర్జీ స్కూల్‌ విద్యార్థులు ఎంపికయ్యారు. కాకినాడ ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌లో జరిగిన జిల్లా స్థాయి బాలల సైన్స్‌ విజ్ఞాన ప్రదర్శనలో తృణ ధాన్యాల ఆవశ్యకత, ప్రస్తుత వినియోగం వంటి అంశాలపై అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు ప్రత్యూష్‌ ప్రధాన్‌, సంజనలు గుంటూరులో ఈనెల 29న జరిగే రాష్ట్రస్థాయి బాలల సైన్స్‌ విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాల డైరెక్టర్‌ సిహెచ్‌.విజరుప్రకాష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులను, ప్రోత్స హించిన ఉపాధ్యాయురాలు ఎస్‌.జయశ్రీలను అభినందించారు. విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.విద్యార్థులను అభినందిస్తున్న డైరెక్టర్‌ విజరు ప్రకాష్‌

➡️