వైసిపి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం

మిని మేనిఫెస్టో

ప్రజాశక్తి – కాకినాడవైసిపిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి, జనసేన ఇన్‌ఛార్జులు వనమాడి వెంకటేశ్వర రావు(డొండబాబు), ముత్తా శశిధర్‌ అన్నారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టిడిపి, జనసేన ఉమ్మడి కార్యచరణతో నగరంలోని 37వ డివిజన్లో వారు ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ అరాచక, విధ్వంసక, అవినీతి పాలనను రానున్న ఎన్నికల్లో తరిమేసేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని, నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అరాచక పాలనను సాగిస్తుందని విమర్శించారు. చంద్రబాబు సారధ్యంలో టిడిపి, జనసేన పార్టీ ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, తోట సుధీర్‌, తలాటం సత్య, మల్లాడి గంగాధరం, బడే కృష్ణ, పాలెపు ధర్మారావు, తుమ్మల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️