వైసీపీలో చేరిక

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలంలోని టిడిపి నేత చిలకా ఇజ్రాయేలు గురువారం యర్రగొండ పాలెంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. ఆయనతో పాటు టిడిపి నుంచి 35 కుటుంబాల వారు వైసీపీలో చేరారు. నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దారవీడు జడ్పిటిసి ఏరువ చలమారెడ్డి, వైసీపీ నాయకులు సింగా ప్రసాద్‌, త్రిపురాంతకం జడ్పిటిసి మాకం జాన్‌పాల్‌, వైపాలెం జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్‌, పుల్లలచెరువు వైస్‌ ఎంపిపి లింగంగుంట్ల రాము లు, సర్పంచ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️