సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్ష

ప్రజాశక్తి – చింతలపూడి

        చింతలపూడి నగర పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకురాలు, మెప్మా ఆర్‌పిల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సుభాషిణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుభాసిణి మాట్లాడుతూ కార్మికుల 18 నెలల ఏరియర్స్‌ వేతనాలు, ఆప్కాస్‌ నుండి రావాల్సిన 34 నెలల హెల్త్‌ అలవెన్సులు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నగర పంచాయతీ సిఫార్సు చేసిన స్వీపర్లను అప్కాస్‌లో చేర్చి న్యాయం చేయాలని కోరారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, మెప్మా ఆర్‌పిలను నగర పంచాయతీలో విలీనం చేసినట్లు ఆన్‌లైన్‌లో కూడా పొందుపరచాలని డిమాండ్‌ చేశారు. వారికి రావాల్సిన 10 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు, మెప్మా ఆర్‌పిలు పాల్గొన్నారు.

➡️