సిఐటియులోకి జోనల్‌ వర్క్‌షాప్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు

ప్రజాశక్తి-విజయనగరం కోట  : ఎపిఎస్‌ఆర్‌టిసి జోనల్‌ వర్కుషాప్‌ కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు శుక్రవారం సిఐటియులో చేరారు. ఈ సందర్భంగా కార్మికులను ఆ యూనియన్‌ రాష్ట్ర కన్వీనర్‌ వి.తులసీరామ్‌, జిల్లా కన్వీనర్‌ ఎ.జగన్‌ మోహన్‌రావు అభినందించారు. అనంతరం వర్క్‌షాప్‌ మేనేజర్‌ జి.వరలక్ష్మి కలిసి సమస్యలపై వినతి అందజేశారు. సర్క్యులర్‌ ప్రకారం ప్రతి నెల 10వ తేదీ లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలని, లేబర్‌ హాలిడేస్‌ కార్మికులందరికీ అమలు చేయాలని, ఇఎస్‌ఐలో కుటుంబ సభ్యులంరినీ యాడ్‌ చేయాలని, పిఎఫ్‌ రసీదులను సంవత్సరం అనంతరం కార్మికులకు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వడంతోపాటు థర్డ్‌ పార్టీ విధానం రద్దుచేసి సంస్థ ద్వారా జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం ఆరుగురితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.

➡️