ప్రజాశక్తి-చీపురుపల్లి : ఈనెల 17, 18, 19 తేదీలలో జరగనున్న కనకమహలక్ష్మి అమ్మవారి జాతరను ప్రజలంతా జయప్రదం చేయాలని జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్ కోరారు. అధికారులు, ఆలయ కమిటీ, ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. జాతరను పురష్కరించుకొని సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాతర జరిగే మూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. పారిశుధ్యం విషయంలో ఎప్పటికప్పుడు పంచాయతీతో పాటు ఆలయ పరిసరాలలో కూడా శుభ్రంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం జాతరకు సంబంధించిన గోడ పత్రికలను వారు విడుదల చేసారు. ఆలయ ఇఒ జి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆలయ కమిటీ ఛైర్మన్ సూర్య ప్రకాశరావు, వైస్ ఛైర్మన్ సూరుకుమార్, ఆలయ కమిటీ సభ్యులు కంది శ్రీరాములు, రేగిడి అప్పలనాయుడు, అడ్డూరి సీతబాబు, బుంగ కనకరాజు, ఎం.రవికుమార్, వంకల కృష్ణ, గ్రామ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ఆర్డిఒ బి.శాంతి, తహశీల్దారు ఎన్.సురేష్, సిఐ సిహెచ్ షన్ముఖరావు, ఎస్ఐ కెకెకె ఆర్ నాయుడు, వైసిపి నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, మంగళగిరి శ్రీనివాసరావు, ఎస్వి కామేశ్వరరావు, ఎస్విజి శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.