సిపిఎం అభ్యర్థికే మా ఓటు 

ఉమ్మడివరంలో రెడ్డి గుంపు గ్రామస్థుల

ప్రజాశక్తి-విఆర్ పురం : ప్రజా సమస్యలపై అను నిత్యం పోరాడే సిపిఎం అభ్యర్థికి మా ఓటు వేస్తామంటూ రేఖపల్లి పంచాయతీలోని రెడ్డి గుంపు గ్రామస్తులు ప్రజలు అన్నారు. సోమవారం ఉమ్మడివరం గ్రామంలోని రెడ్డి గుంపు సమావేశం ఏర్పాటు చేసి సిపిఎం నాయకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు పార్టీ నేతలతో మాట్లాడుతూ మా గ్రామంలో పలు సమస్యలను పరిష్కరించి, సమస్యలు వచ్చిన ప్రతి సందర్భంలో ‘మాకు వెన్నంటి నిలిచిన సిపిఎం పార్టీకే మా ఓటు వేస్తామని’ ఆ విధంగా గ్రామస్తులమంతా పార్టీ నాయకులకు తెలిపారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు జిల్లా కమిటీ సభ్యులు పూనం.సత్యనారాయణ మాట్లాడుతూ ఆదివాసులకు అండగా నిలిచే పార్టీ సిపిఎం ఒకటేనని, ప్రజా సమస్యల పరిష్కారంలో, గ్రామాల అభివృద్ధిలో సిపిఎం పార్టీ దిక్సూచిగా నిలిచిందని అన్నారు. చట్టసభల్లో సిపిఎం ప్రతినిధి ఉండాల్సిన అవసరం ఈ సమయంలో ఎక్కువగా ఉందని వారు అన్నారు. సిపిఎం పార్టీ సభ్యులు చట్ట సభల్లో లేనందుల వలన గిరిజన చట్టాల హక్కులకు భంగం కలుగుతుందని అన్నారు. గిరిజనులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆదివాసిలంతా ఆలోచించి ఒక తాటిపైకి వచ్చి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని వారు అన్నారు. మద్దతు తెలుపుతున్న గ్రామస్తులు వారు అభినందించారు. ఇదే ఒరవడి మిగతా గిరిజన గ్రామాల్లో కూడా వస్తే సిపిఎం అభ్యర్థి రంపచోడవరం నియోజకవర్గంలో సునయాసంగా గెలుస్తారని వారు అన్నారు. ఈ సమావేశంలో నాయకులు రేఖపల్లి సర్పంచ్ పూనెం సరొజిని, చిక్కాలరామారావు, సొడి మల్లయ్య, జి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

➡️