తాగునీటి సమస్యను పరిష్కరించాలి

May 5,2024 00:20
సమస్యను తెలుసుకుంటున్న ఆదివాసీ గిరిజన సంఘం నేతలు

ప్రజాశక్తి-హుకుంపేట:తాగునీటి సమస్యను పరిష్కరించాలని గిరిజన మహిళాలు, నాయకులు కోరారు. మండలంలోని పాతకొట పంచాయతీలోని పి.చింతలవిధీ, పాతకొటలో తాగునీటి కొరతతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని సందర్శించిన ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు, వైస్‌ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, టి.కృష్ణారావు, సోమన్న మాట్లాడుతూ, ఓట్లు అడిగే నాయకులు గ్రామంలో నెలకొన్న తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.తాగునీటి సౌకర్యం కల్పించని నాయకులకు ఓటును అడిగే హక్కు లేదన్నారు.5సంవత్సరం పరిపాలన చేసినా తాగునీటి సౌకర్యం కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు దేవుడు నాయుడు, నాయకులు శివ, చిట్టిబాబు, రామారావు, గ్రామ ప్రజలు బాకురు శ్రీనివాసరాజు, చిన్నలమ్మ, లక్ష్మీ పాల్గొన్నారు.

➡️