ప్రజాశక్తి-చింతపల్లి:పాడేరు, చింతపల్లిలో ఈనెల 8న సిపిఎం కేంద్ర పొలిట్బ్యూరో సభ్యురాలు బందా కారత్ పర్యటించనున్నారని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి బోనంగి చిన్నయ్య పడాల్ తెలిపారు. శనివారం చింతపల్లిలో బృందాకరత్ సభా స్థలాన్ని సిపిఎం మండల కార్యదర్శి పాంగి ధనంజరుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీకి ఓటమి తప్పదన్నారు. ఇండియా వేదికను గెలిపించడంతోనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకిక తత్వం కాపాడబడతాయన్నారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు పాడేరులోనూ, 3గంటలకు చింతపల్లిలో నిర్వహించే రోడ్ షోను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సిపిఎం మండల కార్యదర్శి సూరిబాబు పాల్గొన్నారు.