ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం) : పట్టణంలోని ఓబులాచారి రోడ్డులోని మహంకాళి ఆలయం వద్ద బుధవారం ఉదయం ఓ దొంగ హుండి సొమ్ము చోరికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఓ యువకుడు ఆలయం పైకప్పు రేకును తొలగించి ఆలయం లోపలికి ప్రవేశించాడు. హుండీ తాళం తెరిచి చోరీకి ప్రయత్నిస్తుండగా అప్పుడే ఆలయంలో పూజలకు వచ్చిన పూజారి, భక్తులకు ఆలయంలో అలికిడి వినడంతో ఇరుగుపొరుగును పిలవగా దొంగ పట్టుబడ్డాడు. అతడిని పోలీసులకు అప్పగించారు.