ప్రజల ముంగిటకే పాలన

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. గురువారం మండలంలోని వేములపూడి పంచాయతీలో సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రం భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ముంగిటకే పాలన అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతీ 2వేల జనాభా కలిగిన ప్రాంతంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీంతో ప్రజల ముంగిటకే ప్రభుత్వం సేవలు అందుతున్నాయన్నారు. రైతుల సౌకర్యార్ధం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను నిర్మించడం జరిగిందని, ఆ కేంద్రాల్లో రైతులకు సంబంధించిన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుర్ల రాజేశ్వరి, సీనియర్‌ నాయకులు బోళెం నరసింహమూర్తి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️