వ్యాపారవేత్త గోపాలకృష్ణపై దాడి 

Mar 18,2024 13:02 #Anantapur District

ప్రజాశక్తి-మడకశిర : మడకశిర పట్టణంలోని మారుతి నగర్ లో తన వేరుశనగ మిల్లులో సమయం 3 గంటలలో కొంతమంది హుటా హుటిన తరలివచ్చి వ్యాపారవేత్త ఎస్ గోపాలకృష్ణపై మరణయుధాలతో దాడి చేశారు. గోపాలకృష్ణకు తలకు బలమైన దెబ్బలు తగలడంతో మడకశిర ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. మడకశిర పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఎస్ గోపాల కృష్ణపై దాడిని తీవ్రంగా ఖండించారు. గోపాలకృష్ణపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసు శాఖకి విన్నవించుకున్నట్లు సమాచారం.

➡️