బాధ్యతలు స్వీకరిస్తున్న శైలజ
అనంతపురం : జిల్లా గహనిర్మాణ సంస్థ ఇన్ఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ)గా శైలజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అనంతపురం ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఇన్ఛార్జి పీడీగా నియమించారు. ఇదివరకు పీడీగా ఉన్న డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి సెలవుపై వెళ్లడంతో ఈఈకి ఆ బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన శైలజకు గహనిర్మాణ శాఖ సిబ్బంది బొకేలు అందజేసి అభినందలు తెలిపారు.