నియోజకవర్గం అభ్యర్థి కరణం వెంకటేష్.
ప్రజాశక్తి – చీరాల : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు తనకు కేటాయించారని జరగనున్న ఎన్నికలలో పూర్తి మద్దతును అందించి తన గెలుపుకు సహకరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ అన్నారు. బుధవారం పట్టణంలో ఉడ్ నగర్ లోని అయన పర్యటించారు. వైసీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి, ప్రేమ హాస్పిటల్ ఎండి డాక్టర్ బాబురావు దంపతులును, మరియు మాజీ చైర్మన్, సీనియర్ నాయకులు సలగల దేవదానం దంపతులును మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికలలో తనకు పూర్తి మద్దతును అందజేసి తన గెలుపుకు సహకరించాలని వారిని కోరారు. నియోజకవర్గం అభివృద్ధి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ గురించి కొద్దిసేపు వారితో చర్చించారు. ఆయన వెంట మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, పలువురు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.