ప్రజాశక్తి – చీరాల: కళాంజలి సంస్థ గౌరవాధ్యక్షులు, సరస్వతీ హాస్పటల్ ఎండి, సుప్రసిద్ధ వైద్యులు డా. పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ శనివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. మన కళాంజలి తరఫున సంస్థ ప్రతినిధులు డాక్టరు మృతి దేహానికి నివాళులు అర్పించారు. అదే విధంగా ఐఎంఏ వైద్యలు, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.