ఆదరిస్తే అభివృద్ది చేస్తా

ప్రజాశక్తి – బాపట్ల
రానున్న ఎన్నికల్లో తనను ఆదరిస్తే బాపట్లను అభివృద్ది చేస్తానని టిడిపి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. తన ఎన్నికల ప్రచారాన్ని పట్టణంలోని 26, 30, 31వార్డుల్లో శుక్రవారం నిర్వహించారు. పోలేరమ్మ గుడి వద్ద నుండి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు దశాబ్దాలుగా బాపట్ల నియోజకవర్గం వెనుకబడి ఉందని అన్నారు. అభివృద్దిలో బాపట్లను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. తాను కేవలం ప్రజాసేవకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. పట్టణంలో దోమల బెడద నివారణకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఒక్కసారి గెలిపిస్తే భిన్నమైన పాలన చూపిస్తానని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నామన శివన్నారాయణ, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️