ప్రశాంతంగా ఏపి పాలిసెట్ పరీక్ష

Apr 27,2024 16:38 #Exam, #Exams, #Polyset

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఏపి పాలిసెట్ ప్రవేశ పరీక్ష స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎం.వీ నారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షకు 248 మంది అభ్యర్థులకుగాను 231 మంది అభ్యర్థులు హాజరయ్యారని, 17 మంది గైర్హాజరుకావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారన్నారు. అనంతరం కళాశాల వ్యవస్థాపకులు చొప్పా గంగిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ చొప్పా అభిషేక్ రెడ్డి లు మాట్లాడుతూ తమ కళాశాలలో ఉన్నటువంటి వసతులను పరిగణలోనికి తీసుకొని తమ కళాశాలను పరీక్షా కేంద్రంగా ఎన్నుకున్నందుకు తమకెంతో గర్వకారణంగా ఉందని, అలాగే పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించి విజయవంతం చేసిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఎం.మారుతీ ప్రసాద్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ టి.ఎన్ రంగనాథ్ లను వారు అభినందించారు.

➡️