పాఠశాలలో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం

Apr 23,2024 12:52 #celebrate, #school, #World Book Day

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేటలోని స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలతో పుస్తక పఠనం చేయించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ …. నేటి సమాజంలో ఎక్కువమంది పుస్తకాలు చదవటం మానేస్తూ, కేవలం వాట్సప్‌, ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విహరించడం ద్వారా తాత్కాలిక వినోదం పొందుతున్నారని అన్నారు. అసలైన విజ్ఞానం పుస్తకాల్లో దాగి ఉందన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. వీరేశలింగం పంతులు గారు ” చిరిగిన చొక్కా అయినా తొడుగుకో, మంచి పుస్తకం కొనుక్కో” అన్నారనీ, ఇకనైనా పుస్తకం పఠనం అందరం అలవాటు చేసుకుందాం అని పిలుపునిచ్చారు.

➡️