అల్లూరి : ఇండియా బ్లాక్ బలపరిచిన సిపిఎం ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్శ, ఎమ్మెల్యే అభ్యర్ది లోతా రామారావు లను గెలిపించాలని కోరుతూ … రంపచోడవరంలో సిపిఎం ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రంపచోడవరం స్థానిక సిపిఎం కార్యాలయం నుండి బయలుదేరి అంబేద్కర్ సెంటర్ మీదుగా గాంధీనగరం, చిన్న గెద్దాడ, పెద్ద గెద్దాడ, రంప, మర్రివాడ, కుంజంవీధి, నడివిధి, పందిరి విధి, పందిరి మామిడి మీదుగా రంపచోడవరం చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.అరుణ్, మాట్ల వాణిశ్రీ, శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల తదితరులు పాల్గొన్నారు.