బకాయి వేతనాల కోసం29న తాలూకా కేంద్రాల్లో ధర్నా : ఎపిటిఎఫ్‌

Feb 27,2024 14:57 #aptf, #dhrana, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉద్యోగ,ఉపాద్యాయులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేత చర్యలకు నిరసనగా ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 29న తాలూకా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు షేక్‌ బుకారి బాబు తెలిపారు. మంగళవారం స్థానిక లక్కపందిరి వీధిలో గల ఎపిటిఎఫ్‌ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎపిటిఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కౌన్సలర్‌ జెసి రాజు మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు మధ్యంతర భృతిని ప్రకటించాలని, 20 కోట్ల ఆర్ధిక బాకాయిలు చెల్లించాలని ఓపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు తాలూకా కేంద్రాల వద్ద నిర్వంచే ధర్నాలో ఉద్యోగులు, పింఛను దారులు, ఎపిటిఎఫ్‌ కార్యకర్తలు పాల్గొనాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు జోగి నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️