మంత్రి బొత్స ఇంటి వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా

Jan 9,2024 17:31 #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు జెఏసి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కొనసాగుతుంది.సమ్మెలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ నుంచి మూడు లాంతర్లు వద్ద ఉన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం మంత్రి బొత్స ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి జెఏసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. మేము ఏమి కొత్త కోర్కెలు కోరడం లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. అయిన ప్రభుత్వం మాతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నది తప్ప మా కష్టాన్ని గుర్తించడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గురువులు,శ్రీనివాసరావు ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️